నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి.. ఘన నివాళులర్పించిన ఆలం వెంకట నరస నాయుడు..
తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా నిలిపిన మహా మనిషి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కీ.శే నందమూరి తారక రామారావు గారు.. శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కేంద్రం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర *రాష్ట్ర కార్యదర్శి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారు సూచన మేరకు* *జిల్లా నాయకులు* *ఆలం వెంకట నరసా నాయుడు*గారి* ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రేడ్డు పంపిణి చేసిన జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు ఈ సందర్బంగా ఆలం వెంకట నరసానాయుడు గారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు మరణం లేని మహారాజుగా వెలుగొందుతున్నారని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని కొనియాడారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు పక్కా గృహాలు రెండు రూపాయలకే కిలో బియ్యం, చీర దోవతి కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కి దక్కుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జులు బూత్ కమిటీలు గ్రామ కమిటీలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Jan 19 2024, 07:26